పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు

by M.Rajitha |
పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కోల్ కతా నుండి ముంబయి వెళ్తున్న రైలు నంబర్ (18029) సీఎస్ఎంటీ షాలిమార్(Shalimar) ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. నాగపూర్ సమీపంలోని కాలమ్నా స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పార్సిళ్లకు చెందిన రెండు బోగీలు ట్రాక్ నుండి పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed