- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కోల్ కతా నుండి ముంబయి వెళ్తున్న రైలు నంబర్ (18029) సీఎస్ఎంటీ షాలిమార్(Shalimar) ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. నాగపూర్ సమీపంలోని కాలమ్నా స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పార్సిళ్లకు చెందిన రెండు బోగీలు ట్రాక్ నుండి పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
Next Story