- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వారితో మాది రాజకీయ మైత్రి మాత్రమే : ఫడ్నవీస్
by Vinod kumar |
X
న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్సీపీతో తమకు ఉన్నది రాజకీయ మైత్రి మాత్రమేనని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఎన్సీపీ కూడా వచ్చే పదేళ్లపాటు తమతోనే ఉంటే.. అప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా బీజేపీతో ఎప్పటికీ కలిసే ఉండేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ‘‘అజిత్ పవార్ వర్గం ఎన్డీయేలో చేరింది బీజేపీని సపోర్ట్ చేయడానికే. ఏక్నాథ్ షిండే కూడా ఇదే ఉద్దేశంతో మాతో చేతులు కలిపారు’’ అని ఆయన చెప్పారు. తమ పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చే వాళ్లందరికీ ఆహ్వానం లభిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పార్టీలే ఇప్పుడు విపక్ష కూటమి పేరుతో ఒక్కటయ్యాయని ఫడ్నవీస్ విమర్శించారు.
Advertisement
Next Story