Sandip Ghosh : క్రైమ్ సీన్‌ను మార్చేందుకే సందీప్ ఘోష్ లెటర్.. బెంగాల్ బీజేపీ చీఫ్ ఆరోపణ

by Hajipasha |
Sandip Ghosh : క్రైమ్ సీన్‌ను మార్చేందుకే సందీప్ ఘోష్ లెటర్.. బెంగాల్ బీజేపీ చీఫ్ ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఓ సంచలన లేఖను బయటపెట్టారు. దానిపై ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సంతకం ఉంది. కాలేజీలోని సెమినార్ హాలులో ఆగస్టు 9న తెల్లవారుజామున జూనియర్ వైద్యురాలిపై దురాగతం జరిగింది.

ఈ ఘటన జరిగిన సరిగ్గా ఒకరోజు తర్వాత (ఆగస్టు 10న) సెమినార్ హాలు పరిసరాల్లో మరమ్మతు పనులు చేయించాలంటూ ఆనాడు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో సందీప్ ఘోష్ కోల్‌కతా ప్రజాపనుల విభాగానికి ఓ లేఖ రాశారు. సెమినార్ హాలు నుంచి హత్యాచారానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసేందుకే ఆయన ఈ లేఖ రాశారని సుకాంత మజుందార్ ఆరోపించారు. చివరకు పోలీసులు కూడా ఈ లేఖ ఆంతర్యాన్ని ఎందుకు నమ్మడం లేదో తనకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఎక్స్ వేదికగా బెంగాల్ బీజేపీ చీఫ్ ఒక పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed