Rahul Priyanka: రేపు వయనాడ్‌కు రాహుల్, ప్రియాంక..బాధిత కుటుంబాలను పరామర్శించనున్న నేతలు!

by vinod kumar |
Rahul Priyanka: రేపు వయనాడ్‌కు రాహుల్, ప్రియాంక..బాధిత కుటుంబాలను పరామర్శించనున్న నేతలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీలు గురువారం వయనాడ్‌లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులైన కుటుంబాలను వీరిద్దరూ పరామర్శించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్, డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడంతో పాటు, వారికి అన్ని సహాయక చర్యలపై సమీక్షించనున్నట్టు తెలుస్తోంది. అయితే రాహుల్, ప్రియాంకలు బుధవారం ఉదయమే వయనాడ్‌లో పర్యటించాల్సి ఉండగా భారీ వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండ్ కాలేమని అధికారులు తెలియజేయడంతో వారు పర్యటనను వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed