మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ : ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం

by Y. Venkata Narasimha Reddy |
మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ : ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో మొదటిసారి మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ అందించాలని నిర్ణయించింది. రాబోయే మహిళల టీ20 ప్రపంచ్ కప్ 2024లో పురుషులతో సమానంగా ప్రైజ్ మనీని ప్రకటించింది. నిజానికి జూలై 2023లో జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ సమావేశంలో 2030 షెడ్యూల్ నుంచి సమాన ప్రైజ్ మనీ అందించాలని నిర్ణయించింది. అయితే ఏడేళ్ల ముందుగానే సమాన ప్రైజ్ మనీని అందిస్తోంది. క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయంగా నిలవనుంది. పురుషులకు, మహిళలకు సమానంగా ప్రైజ్ మనీ అందిస్తున్న గేమ్ గా కూడా క్రికెట్ నిలిచింది. మహిళలు, పురుషుల జట్ల విజేతలకు రూ.66 కోట్ల 64లక్షల(2.34 మిలియన్ల డాలర్లు) ప్రైజ్ మనీ అందించనున్నారు. టోర్నీ రన్నప్ లకు (1.17 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీ అందించనున్నారు. ఇది 2023 ఛాంపియన్లకు ఇచ్చిన ప్రైజ్ మనీకంటే 134 శాతం అధికం. 2024 ఏడాది టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలుచుకున్న పురుషుల జట్టు టీమిండియాకు యూఎస్ డాలర్లలో 2.45 మిలియన్ క్యాష్ ప్రైజ్ ను ఐసీసీ అందించింది. ప్రతిష్టాత్మకమైన మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed