Narendra Modi in Poland : పోలెండ్ కు చేరుకున్న భారత ప్రధాని

by M.Rajitha |
Narendra Modi in Poland : పోలెండ్ కు చేరుకున్న భారత ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలెండ్ చేరుకున్నారు. భారత్, పోలెండ్ మధ్య 7 దశాబ్దాల దౌత్య సంబంధాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని రెండు రోజుల పోలెండ్ పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని అక్కడి నుండి ఉక్రెయిన్ కు ప్రత్యేక ట్రైన్లో వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో సమావేశమవుతారు. కాగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దం జరుగుతున్న వేళ మోదీ ఉక్రెయిన్ పర్యటన సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సమావేశం అనంతరం తిరిగి అదే ప్రత్యేక ట్రైన్లో పోలెండ్ చేరుకొని, అక్కడి నుండి ఇండియాకు తిరిగి వస్తారు. తన పర్యటన ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని అభిప్రాయ పడ్డారు. అయితే గత ఐదు దశాబ్దాల కాలంలో పోలెండ్ లో పర్యటించిన మొదటి ప్రధాని మోదీ కావడం విశేషం.

Next Story

Most Viewed