ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన

by M.Rajitha |
ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ రాజకీయాల్లో మరో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చే ఏడాది జరిగే బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను నిలబెడతానని ప్రకటించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున తన పార్టీని ప్రకటిస్తానని ఇదివరకే వెల్లడించారు. ప్రస్తుతం 'జన్ సురాజ్' యాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్.. తన రాజకీయ పార్టీ పేరు కూడా అదే ఉండబోతుంది అనే ఊహాగానాలు బీహార్ రాజకీయాల్లో నడుస్తున్నాయి. ఆదివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. వచ్చే ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లో జన్ సురాజ్ పోటీ చేయబోతుందని తెలిపారు. తన పార్టీలో అత్యధికంగా మహిళలే ఉంటారన్న ప్రశాంత్.. ఈ దేశంలో మహిళా సాధికారత లేదని, అది తన పార్టీ సాధించి చూపిస్తుందని అన్నారు. ఇక్కడి మహిళలందరికీ జీవనోపాధి కల్పిస్తే.. వారు బతుకుదెరువుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు అవ్వాలని, అప్పుడే వారికి నిజమైన స్వేచ్చ అని పేర్కొన్నారు. అబద్దపు హామీలు ఇచ్చే నేతలు, వారి వారసుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు.

Next Story

Most Viewed