- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు
దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏర్పాటు చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారత పార్లమెంటులోని అతి ముఖ్యమైన కమిటీల్లో పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఒకటి. ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు ఎంత మేరకు సమర్థవంతంగా వాడబడిందో ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి ప్రతిపక్ష సభ్యుల్లో నుండి ఒకరిని చైర్ పర్సన్ గా ఉంటారు. మిగతా సభ్యులు వివిధ పార్టీల నుండి ఎన్నుకోబడతారు. కాగా 2024-2025 కు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏర్పాటయింది. ఉభయ సభల నుండి మొత్తం 29 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుండి బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు, జనసేన సభ్యుడు బాలశౌరి ఈ కమిటీలో సభ్యులుగా ఉండగా, రాజ్యసభ నుండి బీజేపీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కు అవకాశం దక్కింది. ఈ కమిటీ వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుంది. తర్వాత ఏడాది కోసం మరో సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.