- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Udhayanidhi: మీ తండ్రి ఆస్తులు అడగట్లేదు.. మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేంద్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు రావాల్సిన సమగ్రశిక్ష అభియాన్ నిధులు తామేమీ అడుక్కోవడం లేదన్నారు. కేంద్రం నుంచి తమకు రూ.2190 కోట్ల రూపాయల నిధులు రావాలని అన్నారు. ‘మేమేమీ మీ తండ్రి సంపాదించిన ఆస్తులు అడగట్లేదు. మాకు హక్కుగా రావాల్సిన నిధులే మేం అడుగుతున్నాం. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేం అడుతున్నాం. బీజేపీ బెదిరింపులకు భయపడేదే లేదు. తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని రెండు భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాడేందుకు ప్రతిపక్షం అన్నాడీఎంకే మాతో కలిసి రావాలి. తమిళనాడు ప్రజలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోంది’అని ఉదయనిధి మండిపడ్డారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద..
అయితే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP) కింద మూడు భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవలే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచారు. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ప్రకంపనలే సృష్టించాయి.