'భద్రతను కట్టుదిట్టం చేయండి'.. ఢిల్లీ అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Vinod kumar |   ( Updated:2023-08-02 10:40:38.0  )
supreme court notices to twitter
X

న్యూఢిల్లీ : ఢిల్లీ అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. హర్యానాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఘర్షణలకు నిరసనగా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌ మద్దతుదారులు దేశ రాజధానిలో ర్యాలీలు చేపడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ ర్యాలీలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి, సీసీటీవీలతో గట్టి నిఘా ఉంచాలని ఢిల్లీ అధికార యంత్రాంగాన్ని నిర్దేశించింది. ఈ నిరసనల్లో ఎలాంటి హింస గానీ, విద్వేష ప్రసంగాలు గానీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు నూహ్ జిల్లా ఘటనను నిరసిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌ శ్రేణులు ఢిల్లీలో దాదాపు 30 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

Advertisement

Next Story

Most Viewed