BREAKING: రైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. 14 రకాల పంటలకు MSP పెంపు

by Satheesh |   ( Updated:2024-06-19 15:47:38.0  )
BREAKING: రైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. 14 రకాల పంటలకు MSP పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోడీ 3.0 సర్కార్ రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఖరీఫ్ సీజన్‌లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం ప్రధాన మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 రకాల పంటల ఎమ్మెస్పీ పెంపునకు కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరికి క్వింటాకు రూ.117 కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు తెలిపింది.

తాజా ధర పెంపుతో క్వింటా వరి ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2300కి చేరింది. వరితో పాటు పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు కూడా ఎమ్మెస్పీ పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూడో సారి అధికారంలోకి రాగానే పీఎం కిసాన్ నిధులు విడుదల చేసి రైతులకు శుభవార్త చెప్పిన మోడీ సర్కార్.. తాజాగా కనీస మద్దతు ధర పెంచుతూ అన్నదాతలకు మరో స్వీట్ న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed