Mayawati comments: ఎస్పీలో పీడీఏ కమ్యూనిటీకి స్థానం లేదు.. బీఎస్పీ చీఫ్ మాయవతి

by vinod kumar |
Mayawati comments: ఎస్పీలో పీడీఏ కమ్యూనిటీకి స్థానం లేదు.. బీఎస్పీ చీఫ్ మాయవతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేత మాతా ప్రసాద్ పాండేను నియమించడంపై బహుజ్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి విమర్శలు గుప్పించారు. పీడీఏ కమ్యూనిటీ (వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీ)లకు ఎస్పీలో స్థానం లేదన్నారు. ఈ వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎస్పీ ఏమీ చేయలేదని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను నియమించేటప్పుడు పీడీఏ వర్గాలను విస్మరించిన విధానం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. కేవలం వారిని ఎన్నికల్లో మాత్రమే వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎస్పీలో ఓ ప్రత్యేక కులానికి తప్ప మరే వర్గానికీ చోటు లేదని ఆరోపించారు. బీఎస్పీ హయాంలోనే వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. కాగా, యూపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా మాతా ప్రసాద్ పాండేను ఇటీవల ఎస్పీ నియమించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed