- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు.. ఇద్దరు జవాన్లు దుర్మరణం
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఇటీవల వరుస ఎన్ కౌంటర్లు జరుగుతోన్న విషయం తెలిసిందే. మావోయిస్టులే లక్ష్యంగా కూంబింగ్ చేపడుతోన్న భద్రతా దళాలు.. నక్సలైట్లను ఎక్కడిక్కకడ మట్టుబెడుతున్నారు. రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 150 మందికి పైగా నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో మరణించారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపై రివేంజ్ తీర్చుకున్నారు. ఆదివారం మందుపాతరతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు.
ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని సిలిగురి- టేకులగూడెం రహదారిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన జవాన్లను విష్ణు, శైలేంద్రగా గుర్తించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.