- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Manipur : మణిపూర్లో కాల్పుల మోత.. నలుగురు మృతి
దిశ, వెబ్డెస్క్ : మణిపూర్లో ఈ రోజు కాల్పుల ఘటనలు కలకలం సృష్టించాయి. మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు ,గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ (UKLF)కి చెందిన ఒక ఉగ్రవాది, ముగ్గురు గ్రామ వాలంటీర్లు శుక్రవారం మోల్నోమ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరణించారు. కాగా ఈ హత్యలకు ప్రతీకారంగా గ్రామ వాలంటీర్లు UKLF చైర్మన్ S S హాకిప్ నివాసానికి నిప్పు పెట్టారు.ఈ క్రమంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని, అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, పరిస్థితి అదుపులో ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. కాగా గత ఏడాది మే నుండి మణిపూర్లోని ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయిటీస్ , పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీల మధ్య జరిగిన జాతి హింసలో 200 మందికి పైగా మరణించారు అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు.