- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
‘వైస్ ఛాన్స్లర్’ ఇకపై ‘కులగురు’
![‘వైస్ ఛాన్స్లర్’ ఇకపై ‘కులగురు’ ‘వైస్ ఛాన్స్లర్’ ఇకపై ‘కులగురు’](https://www.dishadaily.com/h-upload/2024/07/01/348044-madhya-pradesh-vice-chancellor-kulguru.webp)
దిశ, నేషనల్ బ్యూరో : ‘వైస్ ఛాన్స్లర్’ పదవి పేరు మారిపోయింది. ఇకపై ఆ పదవిలో ఉన్నవారిని ‘కులగురు’ అని పిలుస్తారు. ఈ కీలక నిర్ణయాన్ని మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో విద్యార్థుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ఈ నెలలో గురుపౌర్ణమి సందర్భంగా దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘కులపతి (వైస్ ఛాన్స్లర్) అనే పదం అప్పుడప్పుడు ఇబ్బందులకు దారితీస్తోంది. ఆ పదవిలో ఉన్న మహిళల జీవిత భాగస్వాములను ‘కులపతి’ భర్తలుగా పేర్కొనడం వారికి ఇబ్బందికరంగా అనిపిస్తోంది’’ అని సీఎం యాదవ్ చెప్పారు. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మోహన్ యాదవ్ పనిచేశారు. ఆ టైంలోనే వీసీ హోదాను ‘కులగురు’గా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. అయితే అందుకు నాటి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు సీఎంగా మోహనే ఉండటంతో ఆ ప్రపోజల్ వెంటనే అమల్లోకి వచ్చేసింది.