- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Lightning strike: ఫుట్బాల్ మైదానంలో పిడుగుపాటు.. ఇద్దరు ప్లేయర్లు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫుట్ బాల్ ఆడుతుండగా మైదానంపై ఒక్కసారిగా పిడుగు పడటంతో ఇద్దరు ప్లేయర్లు మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లతేహార్ జిల్లా బరియాతు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇట్కే గ్రామంలో గురువారం సాయంత్రం స్థానికంగా ఉండే గ్రౌండ్లో కొంతమంది యువకులు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసే సమయానికి మైదానంలో ఆకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో ఇద్దరు ఆటగాళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు బాలుమత్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అశుతోష్ కుమార్ తెలిపారు. మృతులను దీపక్ కుమార్ (24), వీరేంద్ర గంజు (25)గా గుర్తించారు. గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.