సచిన్ నుండి ప్రాణహాని : బీజేపీ నేత తీవ్ర ఆరోపణలు

by M.Rajitha |
సచిన్ నుండి ప్రాణహాని : బీజేపీ నేత తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్, రాజ్యసభ సభ్యుడు రాధామోహన్ దాస్ అగర్వాల్ సంచలన ఆరోపణలు చేశారు. తాను రాజస్తాన్లో ఉన్నంత వరకు తనకు చిన్న హాని జరిగినా దానికి రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు. ఇటీవల టోంక్ లో పర్యటించినపుడు రాధామోహన్.. సిక్కు అల్లర్లను, రాజీవ్ గాంధీలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా సచిన్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాధామోహన్ కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆయన క్షమాపణలు చెప్పేంత వరకు వదలము అంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్ల జెండాలతో నిరసనలు చేపట్టారు. కొంతమంది నిరసనకారులు రాధామోహన్ కారు మీద ఇంక్ చల్లి, ఆయన కారు ముందు బైఠాయించారు. ఈ క్రమంలో రాధామోహన్ తనకు సచిన్ నుండి ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు చేశారు.

Next Story

Most Viewed