- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
యూత్ కోసం ఆలయాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలి: ఇస్రో ఛైర్మన్
దిశ, నేషనల్ బ్యూరో: దేవాలయాల్లోకి యువతను ఆకర్షించేందుకు లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సలహా ఇచ్చారు. శనివారం తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి గుడి నుంచి అవార్డును స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆలయాలు దేవుని నామస్మరణ కోసం వచ్చే వృద్ధులకు మాత్రమే కాకుండా సమాజాన్ని మార్చే ప్రదేశాలుగా మారాలన్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో వస్తారని నేను ఊహించాను, కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆలయ నిర్వాహకులు వారిని దేవాలయాల వైపు ఆకర్షించడానికి కృషి చేయాలి. దేవాలయాలలో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అని ఇస్రో చైర్మన్ అన్నారు.
ఆలయాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం ద్వారా చదువుకోవాలనే యువత ఇక్కడికి వస్తారు. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చించి వారి కెరీర్ను అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడుతుంది, ఆలయ నిర్వాహకులు ఆ దిశగా పని చేస్తే పెద్ద మార్పులు వస్తాయని సోమనాథ్ అన్నారు. శ్రీ ఉడియన్నూర్ దేవి గుడి ఏర్పాటు చేసిన అవార్డును ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్, ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్కు అందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాన కార్యదర్శి కె.జయకుమార్, ఎమ్మెల్యే వీకే.ప్రశాంత్తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.