కాంగ్రెస్ నిరసనల ఎఫెక్ట్.. గవర్నర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ

by M.Rajitha |
కాంగ్రెస్ నిరసనల ఎఫెక్ట్.. గవర్నర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిరసనల జ్వాల కేంద్రానికి తాకింది. ఇటీవల ముడా భూకుంభకోణంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విచారణకు అనుమతులు మంజూరు చేశారు. దీనిపై మండిపడిన సిద్దరామయ్య, గవర్నర్ అనుమతి చెల్లదంటూ హైకోర్టుకు వెళ్ళగా, కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎలాంటి విచారణ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉదంతంలో కన్నడనాట గవర్నర్ పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చాలా చోట్ల గవర్నర్ కేంద్రానికి అనుకూలంగా పని చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం గవర్నర్ భద్రతను కట్టు దిట్టం చేస్తూ.. ఒకటి రెండు రోజుల్లో జడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించనున్నట్టు ప్రకటించింది. కాగా మంగళవారం నుండే గవర్నర్ బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుతున్నారు.

Next Story

Most Viewed