- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
'భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'.. భారత ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
by Vinod kumar |
X
న్యూఢిల్లీ : భారత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. "భవిష్యత్తులో మన ముందున్న సవాళ్లు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. అందుకోసం సదా సిద్ధంగా ఉండాలి" అని సాయుధ బలగాలకు ఆయన పిలుపునిచ్చారు. 24వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కాశ్మీర్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
1999 కార్గిల్ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదని మనోజ్ పాండే పేర్కొన్నారు. "మాతృభూమి పరిరక్షణ కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ వీర పుత్రులకు నేను వందనం చేస్తున్నాను.. జాతికి మొదటి స్థానం ఇచ్చి, దాని కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడని వీర కుమారులకు నా వందనం" అని చెప్పారు.
Advertisement
Next Story