'సనాతన ధర్మంపై ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు'

by Vinod kumar |   ( Updated:2023-09-04 15:06:19.0  )
సనాతన ధర్మంపై ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు
X

కోల్‌కతా: సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ వెల్లడించింది. ఆయన వ్యాఖ్యలకు విపక్షకూటమి ఇండియాతో ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. ‘అలాంటి వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. సామరస్యం మన దేశ సంస్కృతి. ఇతర మతాలను గౌరవించాల్సిన అవసరం ఉంది.

ఉదయనిధి వ్యాఖ్యలతో ఇండియా కూటమికి సంబంధం లేదు. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది’ అని వెల్లడించారు. కాగా, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయానికి హిందూ సనాతన ధర్మం వ్యతిరేకమని, కరోనా, మలేరియా, డెంగ్యూ జ్వరం లాంటి సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే సరిపోదని, దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed