ప్రధాని మోడీపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

by GSrikanth |
ప్రధాని మోడీపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత యూపీఏ పాలనపై కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి పేలుళ్లకు పాల్పడుతున్నా నాటి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. అదే ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక భారత దేశం సురక్షితంగా మారిందన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన బూత్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. గత 70 ఏళ్లలో పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేయనిది నరేంద్ర మోడీ చేసి చూపుతున్నారన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పేదల పాలిట 'మెస్సయ్య'గా మారారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగా ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed