- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Haryana election: హర్యానాలో బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన కీలక నేత
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సుఖ్వీందర్ మండి పార్టీని వీడారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో శనివారం హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. బధ్రా మాజీ ఎమ్మెల్యే అయిన సుఖ్వీందర్ అదే సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించగా బీజేపీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. అంతకుముందు హర్యానా బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ సైతం కాంగ్రెస్లో చేరారు. దీంతో సీనియర్ నేతలు వరుసగా పార్టీకి వీడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Advertisement
Next Story