Uttar Pradesh Rape Case: 14 ఏళ్ల బాలికపై టీచర్ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి

by Shamantha N |
Uttar Pradesh Rape Case: 14 ఏళ్ల బాలికపై టీచర్ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్రలో 14 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. గత 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం అర్ధరాత్రి చనిపోయింది. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సోన్ భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలో బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు విశాంబర్ బాలిక చదువుతున్న పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెను పిలిచాడని తెలిపారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు

అత్యాచారం జరిగిన తర్వాత నుంచి బాధితురాలి ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స కోసం ఆమెను ఛత్తీస్ గఢ్ లోని బంధువుల ఇంటికి పంపగా.. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. విషయాన్ని బంధువులకు చెప్పడంతో వారు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, అవమానానికి భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబీకులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు నిందితుడి దగ్గర రూ. 30 వేలు తీసుకున్నట్లు బాధితురాలి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జులై 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. విశాంబర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed