Separatist Yasin Malik : కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
Separatist Yasin Malik : కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్ వేర్పాటువాది, పలు ఉగ్రవాద ఘటనలో సంబంధం ఉన్న యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చట్టవిరుద్ద కార్యకలాపాల(నివారణ)చట్టం(UAPA) ట్రైబ్యునల్ ముందు యాసిన్ మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాను అహింస మార్గంలో పయనిస్తున్నానని, సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టినట్లు చెప్పారు. 1994 నుంచి హింసను విడిచిపెట్టినట్లు తెలిపాడు. ఐక్య, స్వతంత్ర కశ్మీర్ కోసం తాను గాంధేయ మార్గాన్ని అనుసరిస్తున్నానని.. ఆయుధాలు వదిలిపెట్టానని చెప్పారు. ఆయుధాలను వదిలినప్పటికీ మాలిక్ ఇప్పటికీ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాడని కేంద్రం పేర్కొంది.

నిషేధాన్ని సమర్ధించిన కోర్టు

ఇకపోతే, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ (JKLF-Y) వ్యవస్థాపకుడే యాసిన్ మాలిక్. 1990లో శ్రీనగర్‌లోని రావల్‌పొరాలో భారత వైమానిక దళానికి చెందిన నలుగురు సైనికులను హత్య చేసిన కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడు. ఈ ఘటనలో స్వ్కాడ్రన్ లీడర్ రవిఖన్నా మరణించాడు. ఈ దాడిలో మరో 22 మంది గాయపడ్డారు. అంతేకాకుండా, ఉగ్రసంస్థలకు నిధులు సమర్పించిన కేసులో దోషిగా తేలిన మాలిక్.. ప్రస్తుతం తీహార్ జైలులో జీవిత ఖైదుగా ఉన్నాడు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందిపై దాడికి సంబంధించిన సాయుధ మిలిటెన్సీకి నాయకత్వం వహించిన జేకేఎల్ఎఫ్- వై నిషేధాన్ని గురించి ట్రైబ్యునల్ విచారించింది. అందులోభాగంగానే జేకేఎల్ఎఫ్-వై నిషేధాన్ని ట్రైబ్యునల్ సమర్థించింది. దాన్ని చట్టవిరుద్ధమైన సంస్థగా పేర్కొంటూ మరో ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగానే యాసిన్ మాలిక్ అఫిడవిట్ సమర్పించాడు.

Advertisement

Next Story