- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీవీ యాక్టర్ మిస్సింగ్.. కిడ్నాప్ కేసు నమోదు
దిశ, నేషనల్ బ్యూరో: ఫేమస్ హిందీ టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ నటుడు గురుచరణ్ సింగ్ గత కొన్ని రోజులుగా కనిపించట్లేదు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన కన్పించకుండా పోయారు. 50 ఏళ్ల గురుచరణ్ ఏప్రిల్ 22న ముంబయికి వెళ్తున్నానని చెప్పి ఢిల్లీలోని ఇంటి నుంచి ఎయిర్పోర్టుకు బయల్దేరారు. ఆ తర్వాత నుంచి ఆయన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. దీంతో ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఆందోళన చెందుకున్నారు
ఫోన్ కూడా పనిచేయకపోవడంతో నటుడి తండ్రి హర్గీస్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గురుచరణ్ తండ్రి. ఏప్రిల్ 22న ఉదయం 8.30 గంటలకు గురుచరణ్.. ఇందిరా గాంధీ ఎయిర్పోర్టు నుంచి ముంబై వెళ్లాల్సి ఉంది. అయితే, గురచరణ్ ఫ్లైట్ ఎక్కలేని తెలిపారు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. నటుడు ఇంటి నుంచి వెళ్లిన రూట్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఏప్రిల్ 22న రాత్రి 9.14 గంటలకు పాలెంలోని పరుశురాం చౌక్ లో బ్యాగ్ తో గురుచరణ్ రోడ్డు దాటుతున్న విజువల్స్ కన్పించాయి. అయితే గురుచరణ్ ను కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించారు ఆయన తండ్రి హర్గిస్ సింగ్. దీంతో దీంతో, ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే, గురుచరణ్ సింగ్ నంబర్ ఏప్రిల్ 24 వరకు యాక్టివ్గా ఉందని.. పలు ట్రాన్సాక్షన్స్ జరిగాయని తెలిపారు అధికారులు.