- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
'ఎన్నికల్లో ధన బలాన్ని పూర్తిగా నియంత్రించాలి'
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ధన బలాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల్లో హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, ధన బలాన్ని కట్టడి చేయాలని పరిశీలకులకు శుక్రవారం నిర్దేశించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్ కు గడువు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆయా రాష్ట్రాలకు చెందిన 1180 మంది ఎన్నికల పరిశీలకులతో సమావేశమైంది. పోలీసులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఎన్నికల సాధారణ విభాగాల పరిశీలకులతో సీఈసీ రాజీవ్ కుమార్ ఈ సమీక్ష జరిపారు.
ఎన్నికల కోడ్ను సమర్థంగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనబలం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహంపై అవగాహన కల్పించారు. ఎన్నికల అబ్జర్వర్లు నిక్కచ్చిగా పని చేయాలని.. తటస్థంగా, నైతికంగా ఉండాలని వారికి సూచించింది. వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, గిరిజన సమూహాలకు ఓటింగ్ను సులభతరం చేయాలని.. వారికి ఎన్నికల గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, సోషల్ మీడియాపై నిఘా పెట్టాలని ఆదేశించింది. పరిశీలకులు ఎన్నికల సంఘానికి కళ్లు, చెవుల లాంటివారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచనలు చేసింది. త్వరలోనే జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేయనుంది.