Earthquake: సిక్కింలో స్వల్ప భూకంపం.. తీవ్ర భయాందోళనకు గురైన జనం

by Shiva |   ( Updated:2024-08-09 04:53:19.0  )
Earthquake: సిక్కింలో స్వల్ప భూకంపం.. తీవ్ర భయాందోళనకు గురైన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్‌లో దేశంలో భూకంప ఘటన మరువక ముందే సిక్కింలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 6.57 గంటల సమయంలో భూమి కపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. అయితే, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. భూమి కంపిచిన వెంటనే అసలు జరగుతుందో తెలియక జనం తీవ్ర భయాందోళకు గుర్యారు. అదేవిధంగా ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. గా, భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సిక్కిం విపత్తు విభాగం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed