Drug Syndicate: ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ఇద్దరు ఆప్ఘన్ పౌరుల అరెస్ట్

by vinod kumar |
Drug Syndicate: ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ఇద్దరు ఆప్ఘన్ పౌరుల అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో డ్రగ్స్ సిండికేట్ నడుపుతున్న ఇద్దరు ఆప్ఘనిస్థాన్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆప్ఘనిస్థాన్‌కు చెందిన హషిమి మహ్మద్ వారిస్, అబ్దుల్ నయీబ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు క్రైమ్ డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు వెల్లడించారు. వారిస్ అనే వ్యక్తి 2020 నుంచి శరణార్థి హోదాపై భారత్‌లో నివసిస్తున్నాడు. ఇండియా వచ్చిన తర్వాత మొదట ఓ షాపులో పని చేసిన ఆయన స్నేహితుడి ద్వారా డ్రగ్స్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఢిల్లీ ఎన్సీఆర్‌లోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు. అలాగే మరో నిందితుడు నయీబ్ సైతం 2020 నుంచి భారత్‌లో ఉంటున్నట్టు వెల్లడించారు. వీరిద్దరూ ఓ షాపులో కలిసి పని చేసేవారని అప్పుడే ఇద్దరికి పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి డ్రగ్స్ దందా సాగిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed