- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఢిల్లీలో అవయవాల అక్రమ రవాణా రాకెట్ ముఠా గుట్టు రట్టు
దిశ, నేషనల్ బ్యూరో: హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ రాకెట్ ని ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఒక మహిళా డాక్టర్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వెనుక ఉన్న ‘మాస్టర్ మైండ్’ బంగ్లాదేశీ అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమిత్ గోయెల్ తెలిపారు. ఈ కేసులో దాతలు, గ్రహీతలు ఇద్దరూ బంగ్లాదేశ్ కు చెందినవారే అని తెలిపారు. ఈ రాకెట్లోని వ్యక్తులందరికీ బంగ్లాదేశ్తో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోగులు, దాతల మధ్య మధ్యవర్తిగా ఉండే రస్సేల్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 2019 నుంచి ఈ అవయవ రాకెట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరి నుంచి 25 నుంచి 30 లక్షలు వసూలు చేసేవారని వెల్లడించారు. అరెస్టయిన డాక్టర్ కు రెండు, మూడు ఆస్పత్రులతో సంబంధాలున్నాయని డీసీపీ పేర్కొన్నారు. మానవ అవయవాల మార్పిడి చట్టం-2014 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.