తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు బ్రిజ్ భూషణ్

by M.Rajitha |
తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు బ్రిజ్ భూషణ్
X

దిశ, వెబ్ డెస్క్ : తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. వినేష్ ఫొగాట్, సాక్షి మాలిక్ వంటి పలువురు ప్రముఖ రెజ్లర్లు పలుమార్లు నిరసనలు చేయడమే కాక, జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కూడా జరిపారు. దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తగా.. కేంద్ర ప్రభుత్వం బ్రిజ్ భూషణ్ ను రెజ్లింగ్ సమాఖ్య నుండి తప్పించింది. తాజాగా బ్రిజ్ భూషణ్ తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోర్టుకెక్కాడు. కాగా అంత సంచలనం సృష్టించిన కేసులో.. రెజ్లర్ల ఆరోపణలు అవాస్తవం అని బ్రిజ్ భూషణ్ తన పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం.

Next Story

Most Viewed