- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
United Nations: శిశు మరణాల తగ్గింపులో ఇండియా భేష్..భారత్పై UN ప్రశంసల వర్షం

దిశ, వెబ్ డెస్క్: United Nations: దేశంలో శిశు మరణాల రేటులో భారీ తగ్గింపు నమోదు చేయడం..ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను అమలు చేయడం పట్ల ఐక్యరాజ్యసమితి భారత్ ను ప్రశంసించింది. భారతదేశం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా అభివర్ణించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ'ఆరోగ్య భారత్ మిషన్' కింద దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య పథకాలు దేశంలో భారీ మార్పులను తీసుకువచ్చాయి. ఆరోగ్య భారత్ మిషన్ ను ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రశంసింస్తోంది. ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ స్కీమును ఐక్యరాజ్యసమితి కూడా అద్బుతమైనదిగా అభివర్ణించింది. ఓ కార్యక్రమంలో, ప్రపంచ సంస్థ 'ఆయుష్మాన్ భారత్' వంటి ఆరోగ్య కార్యక్రమాలను ఉటంకిస్తూ, శిశు మరణాల రేటును తగ్గించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను..రోగతిని ప్రశంసించింది. భారతదేశం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా అభివర్ణించింది.
ఆరోగ్య వ్యవస్థలో వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా దేశం లక్షలాది మంది ప్రాణాలను కాపాడిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మంగళవారం విడుదల చేసిన UN బృందం శిశు మరణాల అంచనా నివేదిక భారతదేశం, నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి దేశాలను ఉదహరించింది. శిశు మరణాలను అరికట్టడంలో సాధించిన పురోగతిలో కీలక పాత్ర పోషించిన పలు వ్యూహాలను హైలైట్ చేసింది. "రాజకీయ సంకల్పం, ఆధారిత వ్యూహాలు, స్థిరమైన పెట్టుబడి మరణాల రేటును గణనీయంగా తగ్గించగలవని" ఈ దేశాలు చూపించాయని నివేదిక పేర్కొంది.
భారతదేశం గురించి, ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశం పరిస్థితిని మెరుగుపరిచిందని నివేదిక పేర్కొంది. "భారతదేశం ఆరోగ్య వ్యవస్థలో వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. లక్షలాది మంది ఇతరులకు ఆరోగ్యకరమైన జీవితాలకు మార్గం సుగమం చేసింది" అని అది పేర్కొంది. 2000 సంవత్సరం నుండి భారతదేశం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాల రేటులో 70 శాతం తగ్గింపును.. నవజాత శిశువుల మరణాల రేటులో 61 శాతం తగ్గింపును సాధించిందని నివేదిక హైలైట్ చేసింది.
భారతదేశంలో ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యల నుండి ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో నొక్కి చెప్పింది. "ఆరోగ్య కవరేజీని విస్తరించడానికి, ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి.. ఆరోగ్య మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అభివృద్ధి చేయడానికి తీసుకున్న చర్యల వల్ల ఇది సాధ్యమైంది" అని ఆయుష్మాన్ భారత్ను ఉదాహరణగా ఉటంకిస్తూ పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఇది ప్రతి కుటుంబానికి సంవత్సరానికి సుమారు US$5,500 వార్షిక కవరేజీని అందిస్తుంది.