ఆ పార్టీ ఇకపై ‘సెక్యులర్’ కాదు.. సీఎం సిద్ధరామయ్య ఫైర్

by Vinod kumar |
ఆ పార్టీ ఇకపై ‘సెక్యులర్’ కాదు.. సీఎం సిద్ధరామయ్య ఫైర్
X

బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీ(ఎస్) పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీ(ఎస్).. ఇక సెక్యులర్ పార్టీగా చెప్పుకోవడం ఆపేయాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపిన దేవెగౌడ పార్టీని ఏమని పిలవాలని ప్రశ్నించారు.

చామరాజనగర్ జిల్లాలోని కోననకెరెలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్ సెక్యులర్ పార్టీ పేరులో ఇకపై సెక్యులర్ అనే పదాన్ని వాడటం సమంజసంగా ఉండదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story