- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Amritsar: పంజాబ్లో చొరబాటు ప్రయత్నం విఫలం.. పాక్ పౌరుడిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్
దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్లోని అమృత్సర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేసింది. భారత్ వైపు వచ్చిన ఓ చొరబాటుదారుడిని కాల్చివేసింది. సోమవారం రాత్రి 9:15 గంటల సమయంలో సరిహద్దులోని రతన్ఖుర్డ్ గ్రామానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న ఓ వ్యక్తి కదలికలను బీఎస్ఎఫ్ గమనించింది. ఈ క్రమంలో కంచె వైపు రావొద్దని అతనికి పలుమార్లు సూచించింది. అయినప్పటికీ అతను వినకుండా పెన్సింగ్ వైపు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న సైనికులు చొరబాటుదారుడిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.270 విలువైన పాకిస్థాన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ఘరిండా పోలీస్ స్టేషన్కు అప్పగించి తదుపరి చర్యలు ప్రారంభించారు.