హాట్ సీట్ ‘కనౌజ్’.. మొన్న మేనల్లుడికి ఇస్తానని.. ఇప్పుడు తానే తీసుకున్న అఖిలేష్‌ !

by Dishanational4 |
హాట్ సీట్ ‘కనౌజ్’.. మొన్న మేనల్లుడికి ఇస్తానని.. ఇప్పుడు తానే తీసుకున్న అఖిలేష్‌ !
X

దిశ, నేషనల్ బ్యూరో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీచేస్తారనే దానిపై ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేష్ గురువారం నామినేషన్ దాఖలు చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ స్థానం నుంచి పోటీ చేసే సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి విషయంలో ఇక ఎలాంటి అయోమయం అవసరం లేదని స్పష్టం చేశారు. కనౌజ్ నుంచి అఖిలేష్ చారిత్రక విజయాన్ని సాధించబోతున్నారని చెప్పారు. వాస్తవానికి కనౌజ్ స్థానాన్ని తన మేనల్లుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు కేటాయిస్తూ రెండు రోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇంతలోనే మనసు మార్చుకున్న అఖిలేష్ తాను స్వయంగా సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట కనౌజ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో అఖిలేష్ మేనల్లుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు షాక్ తగిలినట్లయింది. తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. ఈయన ములాయం సింగ్ అన్నయ్య రతన్ సింగ్ మనవడు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుమార్తెను తేజ్ ప్రతాప్ పెళ్లి చేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సుబ్రత్‌ పాఠక్‌ కనౌజ్ నుంచి గెలిచారు. అంతకుముందు వరకు ఈ సీటు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉండేది.



Next Story

Most Viewed