- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Akhilesh Yadav : కుల ప్రాతిపదికన యోగి సర్కారు ఫేక్ ఎన్కౌంటర్లు : అఖిలేష్
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. కుల ప్రాతిపదికన ప్రజలను టార్గెట్గా చేసుకునేందుకు ఫేక్ ఎన్కౌంటర్లను సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన ఓ హైప్రొఫైల్ దొంగతనం కేసులో మంగేశ్ యాదవ్ అనే వ్యక్తిని యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా బుధవారం ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
‘‘యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసేందుకు తొలుత ఓ టార్గెట్ను ఎంచుకుంటోంది. అందుకోసం ఒక కట్టుకథను అల్లుతోంది. అనంతరం ఎన్కౌంటర్ చేయబోయే వ్యక్తికి చెందిన కుటుంబం మాట్లాడకుండా ఉండేలా ఒత్తిడిని పెంచుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాకుండా ముందస్తు ప్లాన్ చేసుకుంటోంది’’ అని అఖిలేష్ తన పోస్టులో వివరించారు.