Akhilesh Yadav : కుల ప్రాతిపదికన యోగి సర్కారు ఫేక్ ఎన్‌కౌంటర్లు : అఖిలేష్

by Hajipasha |
Akhilesh Yadav : కుల ప్రాతిపదికన యోగి సర్కారు ఫేక్ ఎన్‌కౌంటర్లు : అఖిలేష్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. కుల ప్రాతిపదికన ప్రజలను టార్గెట్‌గా చేసుకునేందుకు ఫేక్ ఎన్‌కౌంటర్లను సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన ఓ హైప్రొఫైల్ దొంగతనం కేసులో మంగేశ్ యాదవ్ అనే వ్యక్తిని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా బుధవారం ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

‘‘యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ చేసేందుకు తొలుత ఓ టార్గెట్‌ను ఎంచుకుంటోంది. అందుకోసం ఒక కట్టుకథను అల్లుతోంది. అనంతరం ఎన్‌కౌంటర్ చేయబోయే వ్యక్తికి చెందిన కుటుంబం మాట్లాడకుండా ఉండేలా ఒత్తిడిని పెంచుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాకుండా ముందస్తు ప్లాన్ చేసుకుంటోంది’’ అని అఖిలేష్ తన పోస్టులో వివరించారు.

Advertisement

Next Story

Most Viewed