యువత, అనుభవానికే చోటు: మంత్రి మండలిపై ప్రధాని మోడీ ప్రశంసలు

by vinod kumar |
యువత, అనుభవానికే చోటు: మంత్రి మండలిపై ప్రధాని మోడీ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నూతన మంత్రి మండలి యువత, అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తుల సమ్మేళనంతో కూడుకుని ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో వారు ఎటువంటి దానినీ వదిలిపెట్టబోరని నొక్కి చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నేను 140 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి, దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కేబినెట్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. మంత్రులందరికీ అభినందనలు తెలిపారు. అలాగే తన ప్రమాణ స్వీకారానికి హాజరైన విదేశీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. మానవ పురోగతి సాధనలో భారతదేశం ఎల్లప్పుడూ మా విలువైన భాగస్వాములతో కలిసి పని చేస్తుందని వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story