- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుజరాత్లో కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలో చేరిన 200 మంది నేతలు
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్లో 200 మంది కాంగ్రెస్ నేతలు కాషాయ పార్టీలో చేరారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి స్పందిస్తూ, కాంగ్రెస్కు మూలస్థంభాలు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వారు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు, కాంగ్రెస్ మునిగిపోయే పడవలా కనిపిస్తుంది, ఆ పార్టీ విభజన కుల రాజకీయాలపై మాత్రమే దృష్టి సారిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్కు నాయకత్వం లేక పోవడంతో ఇక్కడ దాని ఉనికి క్షీణిస్తున్న నేపథ్యంలో మేము బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాము, దేశ నిర్మాణం కోసం వారితో కలిసి నడుస్తామని నాయకులు చెప్పారు.
పురుషోత్తమ్ రూపాలా మాట్లాడుతూ, కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు బీజేపీకి పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నట్లు తెలిపారు. అంతకుముందు మే 4న, రాజ్కోట్ మాజీ మేయర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ దంగర్, బీజేపీ ప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ భరత్ బోఘ్రా, పురుషోత్తమ్ రూపాలా సమక్షంలో అధికారికంగా కాషాయ పార్టీలో చేరారు. మరోవైపు, పటీదార్ సామాజిక వర్గానికి చెందిన పురుషోత్తమ్ రూపాలా ఇటీవల రాజ్పుత్లు, మొఘలుల మధ్య జరిగిన చారిత్రక మతాంతర వివాహాల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన క్షత్రియ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.