‘జగన్ దౌర్జన్యకాండ కొనసాగుతోంది’

by  |
‘జగన్ దౌర్జన్యకాండ కొనసాగుతోంది’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ లీడర్ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న లోకేశ్ ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి సచివాలయ ఉద్యోగి పై చేస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో పై లోకేశ్ ట్వీట్ చేస్తూ.. ‘ వైఎస్ జగన్ గారి దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైసీపీ గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లా మండిగిరిలో వైసీపీ నేత కల్లుబోతు సురేష్ గ్రామ సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ, భౌతికదాడి చేశాడు. చెప్పిన పని చెయ్యలేదని ప్రభుత్వ ఉద్యోగి చెంప పగలకొట్టడానికి ఎంత దైర్యం? అధికార మదంతో వైసీపీ నాయకుల కళ్ళు నెత్తికెక్కాయి. ఏఓ పై దాడి చేసిన వైసీపీ నేత ని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి’ అంటూ ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed