మాట మార్చుడు, మడమ తిప్పుటకు బ్రాండ్ అంబాసిడర్‌ జగన్: లోకేశ్

by srinivas |
Lokesh-1
X

దిశ, ఏపీ బ్యూరో: మాట మార్చుడు, మడమ తిప్పుటకు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం వైఎస్ జగన్ మారారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని మాటిచ్చిన సీఎం జగన్ రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ దిక్కులేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

సీఎం జగన్‌కు సీపీఎస్ రద్దుపై అవగాహన లేకుండానే హామీ ఇచ్చారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించడం ఉద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు. ఓట్ల కోసం అమలుకు సాధ్యంకానీ హామీలిచ్చి, వాటిని నెరవేర్చలేకపోయినందుకు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తోన్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని నారా లోకేశ్ తెలిపారు.

Next Story