దివ్యది ముమ్మాటికి హత్యే..

by Sumithra |
దివ్యది ముమ్మాటికి హత్యే..
X

దిశ, వెబ్‎డెస్క్: విజయవాడలో దివ్యతేజస్విని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దివ్య శరీరంపై గాయాలు సొంతంగా చేసుకున్నవి కావని.. ముమ్మాటికి హత్యేనని వెల్లడైంది. తామిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం.. ఎవరికీ వాళ్లం కత్తితో గాయాలు చేసుకున్నామంటూ నిందితుడు నాగేంద్ర చెప్పిన మాటలన్నీ అబద్దాలు లేవని పోలీసులు తేల్చారు. దీంతో పాటు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసిన పోలీసులు ఛార్జిషీటును సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు నాగేంద్ర డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకోనున్నారు.

Next Story

Most Viewed