ముందుదే ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి

by srinivas |
ముందుదే ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, ఏపీబ్యూరో : పోలవరం ప్రాజెక్టును ముందస్తు డిజైన్​ ప్రకారమే నిర్మిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ప్రతిపక్షాలు చేస్తున్నది దుష్ప్రచారమని మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు నిధుల కొరత అనేది సాధారణ అంశంగా పేర్కొన్నారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వల దిగుమతి కోసం హార్బర్​లో మూడు ఓడలు ఎదురు చూస్తున్నాయన్నారు. అమ్మోనియం నిల్వలను విశాఖలో నిల్వ చేయకండా నేరుగా పరిశ్రమలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వివిధ వర్గాలవారికి ఇస్తున్న పింఛన్ల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed