వారిపై పరువు నష్టం దావా వేయిస్తా? : సుబ్రమణ్యస్వామి

by Shamantha N |
వారిపై పరువు నష్టం దావా వేయిస్తా? : సుబ్రమణ్యస్వామి
X

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంపై వస్తున్న ఆరోపణలపై తాను విసుగుచెందినట్లు పేర్కొన్నారు. తప్పుడు కథనాలు ప్రచురితం చేస్తున్న ఆయా పత్రికా సంస్థలపై పరువునష్టం దావా వేయిస్తానని వెల్లడించారు. ఇటీవల శ్రీవారి ఆలయంలో అన్యమతస్థుల నియామకం మొదలు, ఆస్తుల విక్రయం వంటి కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే అసహనం వ్యక్తం చేసిన సుబ్రమణ్యస్వామి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed