- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
- ప్రపంచం
యాంకర్ రష్మి డ్రెస్ సైజు తగ్గించాలి అంటూ ధర్నాకు దిగిన మహిళలు.. తన రియాక్షన్ ఇదే!
దిశ, సినిమా : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. 2013 లో ప్రసారమైన ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ రోజుల్లో ఈ షో సూపర్ హిట్ అయ్యింది. దీంతో దీనిని రెండు భాగాలుగా తీసుకొచ్చారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్గా ప్రేక్షకులకు కామెడీ పంచింది. ప్రస్తుతం జబర్దస్త్పై ఆధారణ చాలా తగ్గిందనే చెప్పవచ్చు. జడ్జీలు మారడం, కమెడీయన్స్ కూడా షోకు గుడ్ బై చెప్పడంతో ఈ షో టీఆర్పీ రేటింగ్ పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ తీసేసి, ఓన్లీ జబర్దస్త్ మాత్రమే కంటిన్యూ చేస్తుంది మల్లెమాల.
అయితే తాజాగా జబర్దస్త్లోని మహిళలు ధర్నాకు దిగారు. లేటేస్ట్ ప్రోమో రిలీజ్ చేయగా అందులో, కమెడియన్స్ తమ స్కిట్స్తో నవ్వులు పూయించారు. అందులో కమెడియన్ రోహిణి మహిళా జబర్దస్త్ కమెడియన్స్ తో కలిసి ధర్నాకు దిగింది. అందులో ఒక ఆడియన్గా ఎక్స్ ట్రా జబర్దస్త్ను చాలా మిస్ అవుతున్నాం. ఎక్స్ ట్రా మళ్లీ రావాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నాకు దిగారు. అంతే కాకుండా ఇందులో కొన్ని ప్లకార్డ్స్ అందరికీ షాకిచ్చాయి. ముఖ్యంగా రష్మి డ్రెస్ను టార్గెట్ చేశారు. ప్లకార్డులో రష్మి డ్రెస్ సైజు తగ్గించాలి, సన్నీకి పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటూ వారు డిమాండ్ చేశారు. ఇక దీనిపై స్పందించిన రష్మి, నేను తగ్గిద్దాం అనే అనుకుంటున్నాను కానీ పెద్దవారు వినడం లేదని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆమె చేసిన కామెంట్స్ అందరి నోట నవ్వులు పూయించింది. ఈ ప్రోమో హైలెట్గా మారడమే కాకుండా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.