- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
- ప్రపంచం
చనిపోతాను అని తెలిసి కోట్ల ఆస్తి అనాథలకు రాసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
దిశ, సినిమా : కొంత మంది నటీనటులు తమ గొప్పమనసును చాటుకొని, రియల్ స్టార్గా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అందులో సీనియర్ స్టార్ నటి ఒకరు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? నటి శ్రీ విద్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న తన ప్యామిలీకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశ్యంతో 14 ఏళ్ల వయసులోనే ఆమె చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది.
అందం, అభినయంతో ఈ నటి చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పెదరాశి పెద్దమ్మ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది. అలా వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఈ నటి తన జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకోవాలని ఆరాట పడిపోయారు. తాను జన్మించిన కొన్ని రోజులకే తండ్రి చనిపోవడంతో, ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ సమయంలో తాను చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ హీరోను ప్రేమించింది. ఆయనే సర్వస్వం అనుకుంది. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ హీరోకు దూరం కావాల్సి వచ్చింది. తర్వాత ఆమె ఓ డైరెక్టర్ను వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. కానీ మళ్లీ ఊహించని విధంగా కష్టాలు చుట్టుముట్టడంతో సెకండ్ ఇన్నింగ్స్లో వెండితెర మీదకు వచ్చి పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వా తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయింది. ఇక ఇవన్నీ తట్టుకొని నిలబడగలిగిన ఈ నటిపై ఆ భగవంతుడే పగపట్టాడేమో.. క్యాన్సర్ రూపకంగా ఆమెకు మరో సమస్యను తీసుకొచ్చాడు. దీంతో మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్తో పోరాటం చేసిన ఈమె, ఇక తాను బతకుతానో లేదో తెలియక, తన పేరు మీద ఉన్న కోట్ల ఆస్తిని పేద పిల్లలు చదువుకునేందుకు ఉపకార వేతనంగా అందజేసింది. తర్వాత ఆమె కన్నుమూశారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.