5 నిమిషాల సీన్‌ను కోసం 5 నెలలు షూటింగ్.. రాజమౌళిని మించిపోయిన ఆ డైరెక్టర్ ఎవరంటే?

by sudharani |
5 నిమిషాల సీన్‌ను కోసం 5 నెలలు షూటింగ్.. రాజమౌళిని మించిపోయిన ఆ డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: కొన్ని కొన్ని సినిమాలు ఏళ్లు గడుస్తున్న కూడా మర్చిపోలేము. ఇప్పటికే చాలా సార్లు చూశాము అనుకున్న కూడా మళ్లీ మళ్లీ చూస్తాం. అలాంటి సినిమాల్లో వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావు’ ఒకటి. ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, సునీల్, ప్రకాష్ రాజ్, ఎమ్ఎస్ నారాయణ ప్రధాన పాత్రల్లో నటించారు. 2001లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టింది. ఇక దాదాపు ఈ మూవీ వచ్చి 24 ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఈ మూవీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయి చూస్తాము. అంతలా అందరిని ఆకట్టుకుంది ఈ చిత్రం. అయితే.. ఈ చిత్రంలో 5నిమిషాల సీన్‌ను చిత్రీకరించడానికి ఏకంగా 5 నెలలు పట్టిందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెలిపాడు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో ప్రకాష్ రాజ్ ‘అమ్మ గురించి గుర్తు చేసుకుంటూ లెటర్ చదివే’ సీన్ ఉంటుంది. అప్పుడు దాదాపు సీన్‌లో మెయిన్ పాత్రలు అన్నీ ఉంటాయి. దీంతో అందరు యాక్టర్స్‌ను ఒకేసారి తీసుకురావడం కష్టమైంది. ఈ సీన్ షూట్ చేసే టైమ్‌లో ఆర్తీ అగర్వాల్ మరో సినిమా కోసం యూఎస్ వెళ్లింది. అలాగే వెంకటేష్ వేరే షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలా సునీల్, ప్రకాష్ రాజ్ వీళ్లంత బిజీగా ఉండటంతో.. దొరికిన యాక్టర్‌తో సీన్‌ను షూట్ చేశాము. అలా ఒక్కొక్కరి డేట్స్ దొరికనప్పుడు.. వాళ్ల సీన్ తీని.. ఫైనల్‌గా అందరి ఫ్రెమ్‌లతో సీన్‌ను క్రియేట్ చేశాము. అలా మొత్తం సీన్ పూర్తయ్యే సరికి 5 నెలల వరకు టైమ్ పట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు విజయ్ భాస్కర్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ కావడంతో.. రాజమౌళిని మించి పోయారుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story