నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఉపాసన ట్వీట్.. పవన్‌ను బాబాయ్ అంటూ ఆమె ఏం చెప్పిందంటే?

by Jakkula Samataha |
నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఉపాసన ట్వీట్.. పవన్‌ను బాబాయ్ అంటూ ఆమె ఏం చెప్పిందంటే?
X

దిశ, సినిమా : పదేళ్ల కల నెరవేరింది. మెగా ఫ్యామిలీ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆరోజు రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ అనే నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. దీంతో ఆయనకు ఎంతో మంది విషెస్ చెప్పారు.

అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా హాజరైన విషయం తెలిసిందే. చిరు, రామ్ చరణ్, రజినీకాంత్, మోడీ, అమిత్ షా వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ సందర్భంలో ప్రమాణ స్వీకార వేదికపై చిరు, పవన్, మోదీ కలిసి దిగిన ఫొటో అందరినీ ఆకట్టుకుంది. స్టేజ్ పైకి చిరును పిలిచి, పవన్, మోడీతో మాట్లాడించారు. తర్వాత వీరు ముగ్గురు కలిసి చేతులు పైకి లేపి నవ్వుతూ ఫోటో దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ ఫోటోను రామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ.. కంగ్రాచ్యులేషన్స్ పవన్ బాబాయ్, జనాలు బాగా ఆలోచించే జనసేన పార్టీని ఎన్నుకున్నారు, జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఇది నెట్టింట దుమారం రేపుతోంది. నెటిజన్స్ ఉపాసన పవన్ కళ్యాణ్‌ను మామయ్య అనాలి కదా, బాబాయ్ అని ఎందుకు అంటుందని ముచ్చటించుకుంటున్నారు. చిరంజీవిని మామయ్య అని, పవన్‌ను బాబాయ్ అనడం కరెక్ట్ కాదు అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలానే బాబాయ్ అంది, దీంతో కొందరు పవన్‌ను బాబాయ్ కాదు మామయ్య అను, ఇప్పటికైనా అలవాటు చేసుకో అంటూ ఆమెకు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఉపాసన పోస్ట్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘గాంధీ తాత అందరికీ తాతయ్య అయినట్టు పవన్ కళ్యాణ్ అందరికీ బాబాయే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed