తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నందమూరి రామకృష్ణ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-25 06:56:55.0  )
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నందమూరి రామకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు, నిర్మాత నందమూరి రామకృష్ణలు అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టామని, తిరుమలకు వచ్చే భక్తులు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారన్నారు. కేంద్రం సమన్వయంతో ఏపీ గాడిలో పడిందని, 4 నెలల్లోనే ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయని, అమరావతి, పోలవరానికి నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని చెప్పారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ బావ నారా చంద్రబాబునాయుడు సీఎం అయితే స్వామివారిని కాలినడకన దర్శించుకుంటానని మెుక్కుకుని ఈ రోజు దర్శించుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబును తిరిగి సీఎంను చేసిన ఏపీ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాదారణంగా కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed