5 నిమిషాల ఆ పనికి రూ. 5 కోట్లు తీసుకుంటున్న టాప్ హీరోయిన్.. ఆమె తర్వాత వీళ్లు కూడా..

by Javid Pasha |
5 నిమిషాల ఆ పనికి రూ. 5 కోట్లు తీసుకుంటున్న టాప్ హీరోయిన్.. ఆమె తర్వాత వీళ్లు కూడా..
X

దిశ, సినిమా : సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలాన్ని బట్టి, ప్రేక్షకుల ఆసక్తిని బట్టి మారుతూ ఉంటంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు సిల్క్ స్మిత లాంటి వారు ఈ టైప్ ఆఫ్ పాటల ద్వారా ఉర్రూతలూగించి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అయితే గతంలో అతికొద్ది ఫేడ్ అవుట్ హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌లో కనిపించేవారు. కానీ ఇప్పుడలా కాదు, ఫేమస్ హీరోయిన్లందరు కూడా స్టార్ హీరోల సరసన ఐటమ్ సాంగ్స్ చేస్తూ అలరించేందుకు రెడీగా ఉంటున్నారు.

ఆ మధ్య ఓ నటి జస్ట్ సింగిల్ సాంగ్‌‌ చేయడానికే రూ.5 కోట్లు తీసుకుని ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ ఐటమ్ గర్ల్‌గా నిలిచింది. ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సమంత రూత్ ప్రభు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో ఈ భామ “ఊ అంటావా” పాటలో 5 నిమిషాలు కనిపించినందుకు అక్షరాలా రూ. 5 కోట్ల వసూలు చేసింది. ఇక సామ్ తర్వాత ఐటమ్ సాంగ్స్‌కు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్‌లో నోరా ఫతేహి, సన్నీ లియోన్ ఉన్నారు. వీరిద్దరూ ఒక్క సాంగ్‌కు రూ. 2 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మలైకా అరోరా ప్రస్తుతం రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఛార్జ్ చేస్తోందట.

Advertisement

Next Story

Most Viewed