- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
విడాకుల తర్వాత తాగుడుకు బానిసైన స్టార్ హీరోయిన్..రీసెంట్గా బయటపడిన సీక్రెట్!
దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఆమె సొంతం. బాలీవుడ్లో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ నటి. ఆ రోజుల్లో ఈ బ్యూటీ సినిమాలో ఉన్నదంటే..ఇక ఈ థియేటర్స్ వద్ద సందడే వేరు ఉండేదంట. అంతలా ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా ఈ హీరోయిన్కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? మనీషా కోయిరాల తన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొందంట. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో పుట్టిన ఈముద్దుగుమ్మ, అనారోగ్యసమస్యలతో చాలా రోజులు మంచానికే పరిమితం అయ్యిందంట. అంతే కాకుండా తాగడుకి బానిసై మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ నటి కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే నేపాల్కు చెందిన సమ్రాట్ దహల్తో 2010లో పెళ్లి చేసుకుంది. అయితే తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లైన ఆరు నెలలకే వీరు విడాకులు తీసుకున్నారు. తన భర్త టార్చర్ను భరించలేక ఆమె విడాకులు తీసుకవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పుకొచ్చింది పలు ఇంటర్వ్యూలలో, ఇక డివోర్స్ తర్వాత మనీషా మానసికంగా చాలా కుంగిపోయిదంట. తాగుడుకు బానిసై డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడటం, కీమోథెరఫీ, సర్జరీల తర్వాత ఆమె దాని నుంచి బయటపడటం జరింది. చాలా రోజులుగా చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ నటి తాజాగా హీరామండి అనే వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. దీంతో ఈ అమ్మడుకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.